Ad Code

హైవేలపై ప్రమాదాల నివారణకు ఏఐ లెన్స్‌ కెమెరాలు ?


ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌ హైవే ట్రాఫిక్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (హెచ్‌టీఎంఎస్‌)కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సిస్టమ్‌ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తికావచ్చని సమాచారం. ఈ సిస్టమ్‌తో వాహన వేగాన్ని గుర్తించడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టేందుకు మరింత అవకాశం లభిస్తుంది. ఈ సిస్టమ్‌ పూర్తిగా ఆటోమేటెడ్‌ విధానంలో కొనసాగనుంది. గడచిన కొద్ది నెలల నుంచి రవాణాశాఖ రాష్ట్రంలోని అన్ని ఆర్టీవోలకు రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని ఆదేశించింది. కాగా హెచ్‌టీఎంఎస్‌లో ముంబై నుంచి పూణె మధ్య 93 స్పాట్‌లలో హైటెక్‌ కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయనున్నారు. ఈ కెమెరాలు వాహన వేగాన్ని గుర్తించే సామర్థ్యం కలిగివుంటాయి. ఈ కెమెరాలలో హైరిజల్యూషన్‌ ఉన్న కారణంగా వాహనంలోని డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో కూడా ఈ కెమెరా చూపిస్తుంది. ఏఐ ఆధారిత లెన్సులు కలిగిన ఈ కెమెరా.. వాహన నంబరు ప్లేటు ఆధారంగా సమాచారాన్నంతా సేకరించి, వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు పంపిస్తుంది. ఈ హైవేలో ఇలాంటి 370 కెమెరాలను అమరుస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నందున వాటి నియంత్రణకు హెచ్‌టీఎంఎస్‌ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. ఇది సమగ్రంగా కార్యకలాలు ప్రారంభించాక రోడ్డు ప్రమాదాలు మరింతగా తగ్గుతాయని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu