Ad Code

దేశంలో కేపీ-1, కేపీ-2 వేరియంట్ కరోనా కేసులు నమోదు !


దేశంలో కేపీ-1, కేపీ-2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేపీ-1 34 కేసులు, కేపీ-2 వేరియంట్ 290 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లతో భయపడాల్సిన అవసరం లేదని, ఇవి అంత ప్రాణాంతకం కాదని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రపంచం మొత్తం కనుమరుగైన కరోనా తాజాగా సింగపూర్ లో మాత్రం విజృంభిస్తుంది. గత వారం రోజుల్లో ఆ దేశంలో 25,900 కొవిడ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. దీంతో ఆ దేశానికి వెళ్లి వస్తున్న వారిపై ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. 

Post a Comment

0 Comments

Close Menu