ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ 'మేడ్ ఇన్ ఇండియా' 4G సేవను ప్రారంభించనుంది. 4G సేవను కంపెనీ పరీక్షిస్తోంది. ఇది 40 నుండి 45 Mbps వేగాన్ని అందజేస్తుందని పేర్కొంది. 700 MHz, 2100 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్లపై పరీక్షించింది. నివేదిక ప్రకారం, పంజాబ్లో తన సేవలను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెలికాం పరిశోధన సంస్థ C-డాట్తో కూడా సహకరించింది. బీఎస్ఎన్ఎల్ పైలట్ ప్రాజెక్ట్తో 8 లక్షల మంది కొత్త వినియోగదారులు 4G నెట్వర్క్కి జోడించినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. బీఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. 'C-DOT సృష్టించిన 4G కోర్తో పంజాబ్లోకి చొచ్చుకుపోతుంది. గతేడాది జులైలో దీన్ని నిర్మించి ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. 4G నెట్వర్క్ కోసం బీఎస్ఎన్ఎల్ టీసీఎస్, తేజస్ నెట్వర్క్,, ఐటీఐ నుండి మద్దతు పొందింది. దీని తర్వాత ఈ నెట్వర్క్ 5Gకి మార్చనుంది. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను చాలా ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేసినట్లు తేజస్ నెట్వర్క్ తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో C-DOT ఇంకా అందుబాటులో లేదు. దేశవ్యాప్తంగా సూపర్ఫాస్ట్ ఇంటర్నెట్ను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను రూపొందించింది. బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయనుంది. కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 వేల 4జీ సర్వీస్ టవర్లను ఏర్పాటు చేసింది. ఇందులో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ యుపీ, హర్యానా సర్కిళ్లలో 6 వేలకు పైగా టవర్లు ఏర్పాటు అయ్యాయి. పాత సిమ్ కార్డ్లను ఉపయోగించే కస్టమర్లు కొత్త నెట్వర్క్ నుండి ప్రయోజనం పొంలేరు. దీని కోసం కంపెనీ సిమ్ కార్డును కూడా మారుస్తోంది. అయితే, BSNL గత కొన్ని సంవత్సరాలుగా 4G సేవలను సపోర్ట్ చేసే సిమ్లను అందిస్తోంది.
0 Comments