Ad Code

ముగిసిన ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు!


రెండు రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భౌతికకాయానికి ఆ దేశ పూర్తి అధికార లాంచనాలతో నేడు టెహరాన్ లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత్ తరుపును దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా హాజరయ్యారు. ఆయన దేశం తరుపున రైసీకి నివాళులు అర్పించారు. ఆపై ఇరాన్ దేశ తాత్కాలిక అధ్యక్షడు మహ్మద్ ముఖ్‌బన్‌ ను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ అంతిమ కార్యక్రమానికి హమాస్, హౌతీ, హిజ్బుల్లా మిటిటెంట్ సంస్థల లీడర్లతో పాటు తాలిబాన్ లీడర్లు కూడా పెద్దెత్తున హాజరయ్యారు. టెహ్రాన్‌ లో జరిగిన ఈ అంత్యక్రియలకు తాలిబాన్ ఉప ప్రధాని ముల్లా బరాదర్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధులందరూ హాజరయ్యారు. ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వం వహించారు. దింతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

Post a Comment

0 Comments

Close Menu