Ad Code

వాగులో స్నానానికి దిగి ఇద్దరు మృతి


ఆంధ్రప్రదేశ్ లోని  బాపట్ల పట్టణ శివారులోని నల్లమడ వాగులో స్నానానికి దిగి ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఆరుగురు బుధవారం ఉదయం పర్యాటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉద్ధృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సన్నీ, సునీల్ మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన గిరి, నందు కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu