Ad Code

తెలంగాణలో పిడుగుపాటుకు ముగ్గురి బలి ?


తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో  కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాల య్యాయి. ఈ విషాదకర సంఘటన యాలాల్‌ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతులు వెంకటయ్య, శ్రీనివాస్‌, లక్ష్మప్పగా గుర్తించారు. క్షతగాత్రుడిని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, గాలివాన బీభత్సానికి పలుచోట్లు చెట్లు నేలకూలాయి. కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్లు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu