Ad Code

మోడీ ప్రభుత్వంలో టీడీపీకి 4, జేడీయూ 2 కేబినెట్ బెర్తులు ?


లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుపుతో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2014, 2019లో కాకుండా ఈ సారి మ్యాజిక్‌ఫిగర్ (272)ని బీజేపీ స్వతహాగా సాధించలేక 240 సీట్ల వద్దే ఆగిపోయింది. దీంతో కూటమిలోని తెలుగుదేశం (టీడీపీ), జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), శివసేన కీలకంగా మారాయి. మొత్తం 543 ఎంపీ సీట్లలో ఎన్డీయేకి ప్రస్తుతం 293 ఎంపీ బలం ఉంది. మోడీ 3.0 సర్కార్‌లో మిత్రపక్షాలకు బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు టీడీపికి నాలుగు మంత్రిత్వ శాఖలు, జేడీయూకి 02 మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం దాదాపుగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu