Ad Code

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ !


ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ కోర్టు గురువారం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈడీతో పాటు.. సీఎం తరఫున వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి నియా బిందు తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని బుధవారం కోర్టు జూలై 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అంతకుముందు జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచగా న్యాయమూర్తి కస్టడీని పొడిగించారు.


Post a Comment

0 Comments

Close Menu