Ad Code

పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ !


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్‌ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియ పర్చుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తన తండ్రి పవన్ తో పాటు ఏపీ వచ్చిన అకీరా నందన్ చంద్రబాబు ఆశీసులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై సుధీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపై కూడా చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ఇరువురు సమాలోచనలు జరిపినట్లు చెబుతున్నారు. పవన్ భార్య అన్నా లెజినోవా, కొణిదెల అకిరా నందన్ తో కలిసి చంద్రబాబు నాయుడిని సత్కరించారు.

Post a Comment

0 Comments

Close Menu