Ad Code

రైలు టాపు ఎక్కి నిద్రిస్తూ జర్నీ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ !

                                                           

రైలు టాపు ఎక్కి హ్యాపీగా నిద్రిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. జనాలు దీన్ని చూసి షాకౌతున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు అత్యంత ప్రమాదకర రీతిలో రైలు ప్రయాణం చేశారు. ఏకంగా రైలు టాపెక్కి నిశ్చితంగా నిద్రపోయారు. రైలు వేగంగా వెళుతున్నా వాళ్లు మాత్రం తమమానాన తాము నిద్రపోయారు. ఇలా చేసిన వారిలో పురుషులే కాకుండా మహిళలు, టీనేజర్లు కూడా ఉండటం గమనార్హం. విధిలేక ఇంతటి రిస్క్ చేస్తున్నారా? లేక వీళ్లది బరితెగింపా అని కొందరు ప్రశ్నించారు. రైలు బోగీ డోర్ పక్కన నిలబడి ప్రయాణిస్తేనే అనేక ప్రమాదాలు జరగుతుంటే వీళ్లు మరీ ఇలా టాపు ఎక్కి ఎలా ప్రయాణించారో అంటూ అవాక్కవతున్నారు. బీదసాదలు జీవితాలు నిత్యం రిస్క్‌తో కూడుకున్నవని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఘోష ఏ ప్రభుత్వమూ పట్టించుకోదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 15 సెకెన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోకు ఏకంగా 17 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఘటన ఎంతగా వైరల్ అవుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక నిబంధనల ప్రకారం, ఇలాంటి ప్రయాణాలు చేసే వారికి రైల్వే అధికారులు జరిమానాలు విధిస్తారు.జైల శిక్ష విధించొచ్చని కూడా కొందరు నెటిజన్లు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu