Ad Code

మియాపూర్‌లో బాలిక హత్య కేసులో కన్నతండ్రే హంతకుడు !


హైదరాబాద్‌ మియాపూర్‌లో 13 ఏళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. బాలికను హత్య చేసింది ఆమె కన్నతండ్రేనని పోలీసులు నిర్దారించారు. అశ్లీల వీడియోలు చూసేందుకు అలవాటు పడి కన్న కూతురిపైనే కన్నేసిన ఆ కామాంధుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే దీనిని బాలిక ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత బాలిక కనిపించడం లేదంటూ నాటకం ఆడాడు. అయితే చివరకు పోలీసుల విచారణలో దొరికిపోయాడు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ ప్రాంతానికి చెందిన బానోతు నరేష్ తన భార్య, కొడుకు, కూతురు (13)తో కలిసి ఉపాధి కోసం ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చాయి. మియాపూర్‌ పరిధిలోని నడిగడ్డ తండాకు వచ్చి నివాసం ఉంటున్నారు. నరేష్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు అతడి భార్య స్థానికంగా ఇళ్లలో పనులు చేస్తుంది. భార్య పొద్దున్నే పనికి వెళ్లినా నరేష్ 11:30 గంటల దాకా ఖాళీగానే ఉండేవాడు. పనికి వెళ్లేదాకా సెల్‌ఫోన్‌లో బూతు వీడియోలు చూసేవాడు. జూన్ 7వ తేదీన నరేష్, అతని భార్య వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. అయితే ఆ రోజు ఇంట్లో సోదరుడితో గొడవ పడిన బాలిక ఇంట్లో నుంచి బయటు వెళ్లింది. ఈ విషయం స్థానికంగా ఉండేవారు నరేష్‌కు చెప్పారు. అయితే నడిగడ్డ తండా సమీపంలోనే నరేష్‌కు అతడి కూతురు కనిపించింది.  బాలికను వంటచెరకు పేరుతో బైక్‌ మీద ఎక్కించుకొని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లాడు. అలా కొంతదూరంగా వెళ్లాక అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన కామవాంఛ తీర్చాలంటూ నీచంగా ప్రవర్తించాడు. అయితే బాలిక గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. అయితే బాలిక ఈ విషయం తన భార్యకు చెబుతుందేమోనని భావించిన నరేష్ బాలికను అంతం చేయాలని నిర్ణయించుకొని బాలిక తలను బండరాయికి మోది అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్టుగా నాటకం ఆడాడు. బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని భార్యతో చెప్పాడు. ఎన్నిచోట్ల వెతికిన కనిపించడం లేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే నరేష్ పోలీసులు స్టేషన్‌కు వెళ్లి బాలిక మిస్ అయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జూన్ 13 రాత్రి నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లో దుర్వాస వస్తుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి బాలిక మృతదేహం కుళ్లిన స్థితిలో గుర్తించారు. అక్కడ లభించిన ఆనవాళ్ల ఆధారంగా బాలికను.. నరేష్ కూతురిగా గుర్తించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జూన్ 14న బాలిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. పోస్ట్‌మార్టం నిర్వహించిన ఎఫ్‌ఎస్‌ఎల్ వైద్యులు బాలిక హత్యకు గురైందని, అయితే అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక ఆధారం లభించింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. నరేష్ బాలిక హత్యకు గురైన నిర్మానుష్య ప్రాంతం వైపు వెళ్లినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే అతడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం అంగీకరించాడు. పలు సెక్షన్ల కింద నరేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Post a Comment

0 Comments

Close Menu