Ad Code

సికింద్రాబాద్ లో నిలిపి ఉంచిన రైలు బోగీలో మంటలు !


సికింద్రాబాద్ మెట్టుగూడలో నిలిపి ఉంచిన రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. రెండు బోగీల నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోచ్ క్లీనింగ్‌కు వెళ్లి ఫ్లాట్‌ఫామ్‌ మీదకు వెళ్తుండగా అదనపు ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Post a Comment

0 Comments

Close Menu