Ad Code

కదులుతున్న రైలు నుంచి యువకుడ్ని ఈడ్చిన ఆకతాయిలు !


ధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కుషినగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరింది. ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిపై దాడి చేశారు. కంపార్ట్‌మెంట్‌ డోర్‌ వద్ద ఉన్న ఒక వ్యక్తి ఆ యువకుడి కాలర్‌ పట్టుకున్నాడు. కదులుతున్న రైలు పక్కగా ప్లాట్‌ఫారమ్‌పై అతడ్ని ఈడ్చాడు. ఫ్లాట్‌ఫారమ్‌ పై పరుగెత్తిన మరో వ్యక్తి దీనికి సహకరించాడు. రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌ నుంచి పట్టాలపై ఆ యువకుడ్ని తోసేందుకు ప్రయత్నించారు. రైలు వేగం అందుకోవడంతో ఆ వ్యక్తులు చివరకు యువకుడ్ని విడిచిపెట్టారు. దీంతో ప్రమాదం నుంచి అతడు బయటపడ్డాడు. భోపాల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 2పై ఈ సంఘటన జరిగింది. ఇది చూసి అక్కడున్న ప్రయాణికులు షాక్‌ అయ్యారు. 'భోపాల్ హైలైట్స్' ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆకతాయిలు ప్రమాదకరంగా యువకుడ్ని రైలు నుంచి ఈడ్చడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu