Ad Code

బడ్జెట్‌ ధరలో జియో భారత్ బీ1 ?

                                                                       

జియో మార్కెట్లోకి భారత్ బీ1 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. పేరుకు స్మార్ట్‌ఫోన్‌ కాకపోయినా స్మార్ట్‌ ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సరికొత్త డిజైన్‌, ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో యూపీఐ సేవలను పొందొచ్చు. అలాగే జియోపేతో పేమెంట్స్‌ కూడా చేసుకోవచ్చు. కంటెంట్‌ స్ట్రీమింగ్ కోసం జియో కు కూడా సపోర్ట్ చేస్తుంది. మెరుగైన అవుట్‌ డిస్‌ప్లేను ఇందులో అందించారు. జియో భారత్‌ జీ1 4జీ ఫోన్‌ ధరను రూ. 1799గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను సింగిల్ బ్లాక్/గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో లభిస్తోంది. ఈ ఫోన్‌లో 2.8 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇందులో 2500 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో గల బ్యాటరీని అందించారు. దీంతో మెరుగైన ఛార్జింగ్‌ లభిస్తుంది. స్టాండ్‌ బై లో ఈ ఫోన్‌ రెండు రోజులు ఛార్జింగ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో కేవలం జియో సిమ్‌ మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. ఇతర సిమ్‌లను ఉపయోగంచడం కుదరదు. 

Post a Comment

0 Comments

Close Menu