Ad Code

సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి : ఐదుగురు సైనికుల మృతి


జమ్మూ కాశ్మీర్ లోని  కథువా జిల్లా మాచేడి ప్రాంతంలో సైన్యం వాహనంపై పక్కా పథకం ప్రకారం కాల్పులకు పాల్పడ్డారు. మాచేడి-కిండ్లీ-మల్హార్‌ మార్గంలో పహారా కాస్తున్న సైనిక వాహనంపై తొలుత బడ్నోటా గ్రామం వద్ద గ్రనేడ్‌ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం సైనికులు ప్రతిఘటించడంతో ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారికోసం అదనపు బలగాలను రప్పించి గాలింపు చేపట్టారు. కాగా, ఆదివారం తెల్లవారుజామున రాజౌరీ వద్ద సైనిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో పరారయ్యారు. కాగా, నెల రోజుల్లో కథువా జిల్లాలో నాలుగు ఉగ్ర దాడులు జరగడం గమనార్హం. కుల్గామ్‌ జిల్లాలోని రెండు గ్రామాల్లో శనివారం నుంచి ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఆరుగురు ఉగ్రవాదులు, ఇద్దరు సైనికులు మృతి చెందారు.

Post a Comment

0 Comments

Close Menu