Ad Code

బాలుడిపై కోతులు దాడి - వీడియో వైరల్‌


త్తరప్రదేశ్‌లోని మధురలో జూలై 12న బృందావన్‌లోని మదన్ మోహన్ ఘెరా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల కిషన్ తన తండ్రి గోపాల్‌ కోసం ఏదో తెచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కాగా, మదన్ మోహన్ గుడి మెట్ల వద్దకు ఆ బాలుడు రాగానే అక్కడున్న నాలుగు కోతులు దాడి చేశాయి. బాలుడ్నిఈడ్చేందుకు ప్రయత్నించాయి. ఇది చూసి అక్కడున్న మహిళలు భయాందోళన చెందారు. వారు అక్కడి నుంచి వెనక్కి వెళ్లారు. ఇంతలో కొందరు వ్యక్తులు పరుగున ఆ బాలుడి వద్దకు వచ్చారు. దీంతో కోతులు ఆ చిన్నారిని విడిచి పారిపోయాయి. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu