Ad Code

షిరిడి - కాకినాడ ఎక్స్ ప్రెస్ లో దొంగల దోపిడీ !


షిరిడి - కాకినాడ ఎక్స్ ప్రెస్ లోని మూడు బోగీలలో ప్రయాణికులను దోచుకొని దొంగలు పరార్‌ అయ్యారు. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా దొంగలు లగేజ్ ని దోచుకుని పోయారు. బీదర్ రాగానే లగేజ్ చోరీ అయినట్లు గుర్తించారు ప్రయాణికులు. బీదర్ లో ట్రైను ఆపి  ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌ గా మారింది. దీనిపై దోపిడీకి గురైన రైల్వే ప్రయాణికులు మాట్లాడుతూ… అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత వరుసగా దోపిడీ చేశారన్నారు. ఒక బోగీ నుండి మరో బోగీలోకి లింకు ఉండడంతో మూడు బోగీలలో దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బ్యాగులోంచి బంగారు ఆభరణాలు, నగలు, నగదు ఎత్తుకొని పోయారన్నారు. మొత్తం ముగ్గురు వచ్చినట్లుగా మాకు అనుమానం ఉందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu