Ad Code

ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ !


ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సమీక్షించారు. ఈరోజు మధ్య మహారాష్ట్రలోని కొంకణ్ లో అత్యంత భారీ వర్షపాతం కురవవచ్చునని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈరోజు ఆర్థిక రాజధానికి రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. దీంతో పాటు ఈరోజు థానే, పాల్ఘర్, పూణే, కొల్హాపూర్, సతారా, రాయ్గఢ్, రత్నగిరిలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu