Ad Code

హైదరాబాద్ లో యువతిపై కారులో అఘాయిత్యం !


ఆంధ్రప్రదేశ్ లోని కడపకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం గత నెలలో హైదరాబాద్ కి వచ్చింది. నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఆ యువతి నివాసం ఉంటుంది. మియాపూర్ ఉన్న ఓ రియల్ ఎస్టేట్  కంపెనీలో సేల్స్ డిపార్ట్ మెంట్ లో ట్రైనిగా జాయిన్ అయింది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు. యువతి కొత్తగా జాయిన్ కావడంతో ఆమెకు పని నేర్పిస్తున్నట్లు నటిస్తూ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. వర్క్ నేర్పిస్తున్నారని ఆ యువతి కూడా నమ్మి వాళ్లతో కొంచెం చనువుగా ఉంది. యువతి చనువుగా ఉండటాన్ని అదునుగా తీసుకున్న నిందితులు సైట్ విజిట్ కి వెళ్దామంటూ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన తరువాత మాటల్లో పెట్టి, మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనకు అనారోగ్యంగా ఉందని వేడుకున్నా వినకుండా నాలుగు గంటలపాటు కారులోనే వేధింపులకు గురి చేశారని బాధితురాలు తెలిపింది. అత్యాచారం అనంతరం బాధితురాలిని హాస్టల్ ముందు వదిలేసి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేసి అక్కడి నుంచి మియాపూర్‌కు పంపించారు. సదరు రియల్ ఎస్టేట్  కంపెనీ వైస్ ఛైర్మన్ సంగారెడ్డి, ఉద్యోగి జనార్ధన్‌లను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu