Ad Code

చంద్రబాబు ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయాలి : షర్మిల


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గం నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నీళ్లలో దిగారు. భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలు తెలుసుకునేందుకు పర్యటించారు. అక్కడి నుంచే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు సాయం చేయాలనన్నారు. నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలు నీట మునిగాయని  షర్మిల చెప్పారు. రైతులు ఇంత తీవ్రంగా నష్టపోతూంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు అందరూ అప్పుల పాలయ్యారని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. రైతుల కష్టాలను పంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, చంద్రబాబు ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయాలని డిమండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని.. రుణమాఫీ చేయకూడదన్న నియమం ఎక్కడా లేదన్నారు. గతంలో హామీ ఇవ్వకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారన్నారు. చంద్రబాబు తక్షణం స్పందించి రైతుల్ని ఆదుకోవాలన్నారు. పంట నష్టం పరిశీలనకు వచ్చిన సమయంలో ఎదురుగా పెద్ద చెరవులా ఉన్న ప్రాంతాన్ని చూసి షర్మిల ఆశ్చర్యపోయారు. అవన్నీ పొలాలేనని, ఆ నీళ్ల కింద వరి పంట ఉందని రైతులు చెప్పారు. దీంతో తాను అందులోకి దిగి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నడుమెత్తున నీళ్లు ఉంటాయని ప్రమాదకరమని పార్టీ నేతలు చెప్పారు. అయినప్పటికీ షర్మిల తాను పొలంలోకి దిగుతానని స్పష్టం చేశారు. దీంతో పార్టీ నేతలు ముందుగా పొలంలోకి దిగి లోతు ఎంత ఉందో చూశారు. కింద నీట మునిగిన వరి పైరును తీశారు. తర్వాత షర్మిల పొలంలోకి దిగారు. ఆమెకే .. నడుంలోతుపైగా నీరు వచ్చాయి. కాసేపు నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చారు. ఓ రాజకీయ నేత అదీ కూడా మహిళా నేత ఇలా నిరసన వ్యక్తం చేయడం హైలెట్ గా మారింది.

Post a Comment

0 Comments

Close Menu