Ad Code

హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ నిందితుడు సయ్యద్ మక్బూల్ మృతి


హైదరాబాద్ లోని దిల్సుక్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ చెందిన ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు దాడుల్లో మక్బూల్ హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దిల్ సుక్ నగర్ బ్లాస్ట్ కేసులో గతేడాది సయ్యద్ కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి మక్బూల్ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆరు నెలల క్రితం హైదరాబాద్, తెలంగాణలో నమోదైన కేసుల కారణంగా ట్రాన్సిట్ వారెంట్ పై అధికారులు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సయ్యద్ మక్బూల్ చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. 

Post a Comment

0 Comments

Close Menu