Ad Code

ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు !


ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. కేబినెట్‌ భేటీ ముగిశాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ''అక్టోబరు తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయి. బోట్‌ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నాం. డంప్‌ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉంది. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం. నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుంది. కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. లోటు బడ్జెట్‌ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలి. శాఖల సంబంధిత అంశాలపై ప్రతినెలా సమీక్ష చేయాలి. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలి. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే దిల్లీ వెళ్తున్నాం. ఈనెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. పంటలబీమా పథకం అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నాం. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసింది'' అని చంద్రబాబు వివరించారు. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు సమాచారం. తండ్రి పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌, కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కుమారుడు రైస్‌ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మన్‌. ఈ ముగ్గురూ కలిసి బియ్యం రీ సైక్లింగ్‌ చేసి కిలో రూ.43కి ఎగుమతి చేశారని ఆక్షేపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంనాటికి ఏం చేద్దాం అనే దానిపై విధివిధానాలతో రావాలని నిర్ణయించారు.

Post a Comment

0 Comments

Close Menu