Ad Code

కస్టమర్లను బుజ్జగించేందుకు క్రౌడ్‌స్ట్రైక్ యత్నం ?


మెరికాకు చెందిన క్రౌడ్‌స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ. గత కొద్ది రోజు ముందు మైక్రోసాఫ్ట్ అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దానికి క్రౌడ్‌స్ట్రైక్ ప్రధాన కారణం. ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో ఒక లోపం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కంప్యూటర్‌లను ప్రభావితం చేసింది.సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా దేశంలోని విమానయాన సంస్థలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్‌ల సేవలు అడపాదడపా నడిచాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా విమానాలు రద్దు చేయబడ్డాయి. న్యూస్ రీడర్ ప్రసారంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ తీవ్రమైన పొరపాటుకు కంపెనీ క్షమాపణలు కూడా చెప్పింది.ఈ సాంకేతిక లోపం వల్ల ప్రభావితమైన వినియోగదారులకు కంపెనీ తాజాగా శుభవార్త చెప్పింది. వినియోగదారులకు $10 విలువైన ఉబర్ ఈట్స్ బహుమతి కార్డ్‌ను అందించింది. భారతీయ రూపాయలలో ఈ బహుమతి విలువ సుమారుగా రూ. 837 ఉంటుంది. ఈ చర్యతో ప్రభావితమైన వినియోగదారుల కోపాన్ని తగ్గించడానికి కంపెనీ ఈ విధమైన బహుమతి ప్రకటించింది. కానీ ఈ భారీ తప్పిదానికి పాల్పడిన కంపెనీ కస్టమర్లను బుజ్జగించేందుకు ఈ బహుమతి సరిపోదని పలువురు భావిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu