Ad Code

మంత్రి కొండా సురేఖతో రేణూ దేశాయ్ భేటీ !


నటి, పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ నేడు అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిశారు. జూబ్లీహిల్స్ లోని కొండ సురేఖ నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రేణు దేశాయ్ కొండ సురేఖతో అనేక అంశాల పైన మాట్లాడారు. కొండ సురేఖతో భేటీ సందర్భంగా రేణు దేశాయ్ వన్యప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన అనేక విషయాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీ కి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ కొండా సురేఖకు వివరించారు. మంత్రిగా కొండా సురేఖ సహాయ సహకారాలు కావాలని రేణు దేశాయ్ కొండా సురేఖతో అన్నారు. సహజంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ఎవరినైనా అత్యంత ఆప్యాయంగా పలకరించే కొండ సురేఖ తన ఇంటికి వచ్చిన రేణు దేశాయ్ ని చాలా స్పెషల్ గా ట్రీట్ చేశారు. నూతన వస్త్రాలు, పండ్లు ఇచ్చి సత్కరించారు. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత పటేల్ కోసం ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణు దేశాయ్ కు తన స్వహస్తాలతో అలంకరించి ఆదరాభిమానాలను చూపించారు.

Post a Comment

0 Comments

Close Menu