Ad Code

బందోబస్తుకు వెళ్లి మద్యం తాగి చిందేసిన ఎఎస్‌ఐ !


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో శంకరాపురంలో రెండు గ్రూపులు కొట్టుకోవడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వర్గంపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆ గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఎఎస్‌ఐ వెంకటేశ్వర్లకు డ్యూటీ వేయడంతో అక్కడికి వెళ్లాడు. మద్యం ప్రియులతో కలిసి సదరు ఎఎస్‌ఐ మద్యం తాగి చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉన్నతాధికారులకు చేరడంతో సదరు ఎఎస్‌ఐని వేకేన్సీ రిజర్వ్‌కు పంపారు. తదపరి చర్యలు తీసుకుంటామని ఉన్నాతాధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu