Ad Code

అసెంబ్లీలో సహనం కోల్పోయిన నితీశ్‌కుమార్‌ !


బీహార్‌ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం నితీష్‌ కుమార్‌ మాట్లాడుతుండగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు. రిజర్వేషన్లు, బీహార్‌కు ప్రత్యేక హోదాపై ఆయన ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ' నితీష్‌ డౌన్‌ డౌన్' అంటూ నినాదాలు చేశారు. దీనిపై నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి ఓ మహిళా నేతపై విరుచుకపడ్డారు. నువ్వు మహిళవే కదా? నీకేమైనా తెలుసా? తాను ఎలా మాట్లాడుతుందో చూడండి. మీరు మహిళల కోసం ఏమైనా చేశారా? లేదు కదా. మేము మాట్లాడతాం మీరు నిశబ్దంగా వినండి.వినకపోతే అది మీ తప్పు.'అంటూ మడిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో నితీష్‌ కుమార్‌ అలవాటు పడిన నేరస్థుడిగా ప్రవర్తిస్తారని విమర్శలు గుప్పించారు. నువ్వు స్త్రీవి, నీకు ఏమైనా తెలుసా?' అంటూ మహిళలపై చౌకబారు, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.


Post a Comment

0 Comments

Close Menu