Ad Code

అనుమానంతో భార్యను, కూతుర్ని చంపి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి !


సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఓ వ్యక్తి తన భార్యను, కూతుర్ని దారుణంగా చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం భార్యపై అనుమానంతో పది నెలల చిన్న పాపతోపాటు భార్య స్వప్నను గణేష్ అనే వ్యక్తి చంపాడు. అనంతరం అల్వాల్ లోని రైల్వే ట్రాక్ పై గణేష్ సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందే అతను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి తాను హత్య చేసిన విషయాలను పోలీసులకు చెప్పాడు. అంతేకాక, తాను కొద్దిసేపటిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు కూడా పోలీసులకు తెలిపాడు. దీంతో మృతదేహాలను బోయిన్ పల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వీరి సంతానం మరో ఇద్దరు చిన్నారులు అనాథలు అయ్యారు. మహారాష్ట్రకు చెందిన గణేష్ నాలుగు నెలల క్రితం బోయిన్ పల్లికు వచ్చి నివాసం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu