Ad Code

రికార్డు స్థాయిలో అమర్‌నాథ్ యాత్రికులు !

మర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు రోజూ వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని ఆ మంచు శివలింగం దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత అమర్‌నాథ్ గుహలో కొలువైన మంచు శివ లింగాన్ని సందర్శించే వారి సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోల్చితే ఈసారి యాత్రికుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. యాత్ర ప్రారంభం అయిన వారం రోజుల్లోనే లక్షన్నర మంది యాత్రికుల కంటే ఎక్కువ మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు. అమర్‌నాథ్ యాత్ర గత నెల 29 వ తేదీన ప్రారంభం కాగా ఈ నెల 4 వ తేదీ వరకు కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,30,260 మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇక ఇందులో గురువారం ఒక్క రోజే ఏకంగా 24 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. బుధవారం 30 వేల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu