Ad Code

పూజ కోసం పొడవాటి కర్ర తెస్తున్నవ్యక్తికి హైటెన్షన్‌ ఓల్టేజ్‌ వైర్లు తాకి మృతి !


త్తరప్రదేశ్‌లోని మహోబాలో ఇంటికి సమీపంలో హైటెన్షన్‌ ఓల్టేజ్‌ వైర్లు ఉండటం ఎంత ప్రమాదమో ఈ ఘటన చూస్తే అర్ధం అవుతుంది. ఇంట్లోకి పొడవాటి కర్ర తీసుకెళ్తున్న ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో మంగళవారం మధ్యాహ్నం తన బంధువుల ఇంట్లో మత పరమైన కార్యక్రమం జరుగుతుండగా ఓ వ్యక్తి పొడవైన వెదురు కర్రను ఇంట్లోకి తీసుకువెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అయితే అతడు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న హై టెన్షన్ వైర్‌ను ఆ కర్ర తాకింది. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని దేవేంద్ర (35)గా గుర్తించారు. విద్యుదాఘాతం ధాటికి దేవేంద్ర పక్కనే ఉన్న గేటుపై పడటంతో అతడి తల బలంగా గేటుకు తలిగిలింది. అనంతరం అతడు నేలపై అచేతనంగా పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు పరుగున వచ్చి అతడి కాళ్లు, చేతులు రుద్దుతూ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. జసోదా నగర్‌కు చెందిన సువేంద్ర సింగ్ ఇంట్లో మంగళవారం పూజా కార్యక్రమం జరిగింది. దీంతో చందోన్ గ్రామానికి చెందిన దేవేంద్ర ఈ కార్యక్రమం కోసం బంధువుల ఇంటికి వచ్చాడు. పూజా తంతులో భాగంగా జెండా కట్టేందుకు పొడవైన వెదురు కర్రను ఇంట్లోకి తెచ్చేందుకు ప్రయత్నించిన క్రమంలో ఇంటి బయట ఉన్న హై టెన్షన్ వైర్‌కు ఆ కర్ర తగిలి క్షణాల్లో మృతి చెందాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు తడిగా ఉన్న కర్ర హై టెన్షన్ వైర్‌ను తాకడంతో ఈ సంఘటన జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu