Ad Code

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి !


ల్గొండ నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ఆగస్టు చివరినాటికి పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ ఎల్ బి సి కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ఆగస్టు చివరి నాటికి పనులను పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ఆరు నెలల నుండి వైద్య కళాశాల పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ తర్వాత ఎక్కువ మంది రోగులు వస్తున్నది నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికే నని తెలిపారు. ఈ వైద్య కళాశాల పూర్తయితే విద్యార్థులకు ఎంతో వీలుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకే 95 శాతం పనులు పూర్తయ్యాయని, బాలికల వసతి గృహం సెప్టెంబర్ లో పూర్తవుతుందని, పనులలో నాణ్యత ఉండాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. రాష్ట్రంలోనే నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను ఉత్తమ వైద్య కళాశాలగా, మోడల్ వైద్య కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూస్తున్నారని, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అప్పలపాలవుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్యశ్రీ సైతం అమలు చేస్తామని, అన్ని వసతులు కల్పిస్తామని, ముఖ్యంగా సిబ్బందికి ట్రాన్స్ పోర్ట్ కోసం రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తాగునీరు, సివిల్ పనులు, విద్యుత్తు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. నర్సింగ్ కళాశాలకు 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, నర్సింగ్ కళాశాలను సైతం ఇదే క్యాంపస్ లో నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu