Ad Code

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేశవరావు!


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావుకి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేశవరావు రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ఢిల్లీ పర్యటలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీలోని కేకే నివాసానికి ఆయన చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేశవరావు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో కేకే నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్లు పక్కా ఉంటుందని, రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని సీఎం చెప్పారు. మూసీ అభివృద్ధి, రీజనల్ రింగు రోడ్డుపై దృష్టి పెట్టామని, ఎటువంటి గందరగోళం లేకుండా 11వేలకు పైగా టీచర్ల బదిలీలు చేశామని అన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu