Ad Code

ప్రజాభవన్ లో బోనాల ఉత్సవం !


హైదరాబాద్ లో ఆషాడ మాసం సందర్భంగా బోనాల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సీఎం రేవంత్, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనం సమర్పించుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu