Ad Code

1,500 మంది ఉద్యోగులను తొలగించిన బ్రేన్​ !


ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్రేన్​ అనే ఐటీ కంపెనీ దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించింది. బిజినెస్​ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెయిల్స్​పంపించింది. మూడు నెలల జీతం ఇవ్వకుండానే లేఆఫ్స్​ప్రకటించింది. మాదాపూర్ మైండ్​స్పేస్​బిల్డింగ్​నం.3ఏలోని మూడు, నాలుగు ఫ్లోర్లలో బ్రేన్ ఎంటర్​ప్రైజెస్​ప్రైవేట్ లిమిటెడ్​పేరుతో ఐటీ కంపెనీ నడుస్తోంది. ఈ కంపెనీకి బెంగళూరు, సింగపూర్​లో బ్రాంచ్ లున్నాయి. హైదరాబాద్​ బ్రాంచ్​లో దాదాపు 3వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలోని 1,500 మందిని తాజాగా తొలగించింది. ఉన్నపళంగా తొలగించడంపై బాధితులు మండిపడుతున్నారు. బ్రేన్​కంపెనీ మూడు నెలలుగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. మార్చి నెలలో ఒకటో తేదీన పడాల్సిన జీతాలను 18న చెల్లించారని తెలిపారు. కొందరికి ఏప్రిల్​నెల మధ్యలో వేశారని చెబుతున్నారు. కొందరికి ఏప్రిల్, మే నెల చివరి రోజుల్లో జీతంలో పది శాతం మాత్రమే చెల్లించారన్నారు. మే నెల నుంచి జీతాలు ఇవ్వకుండా తేదీలు మార్చుతూ వస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తాజాగా హెచ్ఆర్​ను సంప్రదిస్తే ఈ రోజు రేపు అంటూ మెయిల్స్​ పంపించారని, చివరికి ఉద్యోగాల నుంచే తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 13న బిజినెస్​కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని లీడర్​షిప్​ ఆపరేషన్స్​పేరిట మెయిల్స్​వచ్చాయని తెలిపారు. సెప్టెంబర్​2 వరకు నోటీస్​ పీరియడ్​గా పేర్కొన్నారని చెప్పారు. సెప్టెంబర్ 2లోపు జీతాలు చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్స్​వచ్చాయంటున్నారు. దీనిపై బాధితులు రంగారెడ్డి జిల్లా జాయింట్​లేబర్ కమిషనర్​ను కలిసి కంపెనీపై ఫిర్యాదు చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu