Ad Code

మ్యాట్రిమోని సైట్లలో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ !


మ్యాట్రిమోని సైట్లు అడ్డాలుగా చేసుకొని పెళ్ళి సంబంధాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఈ కేసులో కోమలి సూర్య ప్రకాష్, శెట్టి సతీష్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే మొదట గుర్తుతెలియని యువతుల ఫొటోలను మ్యాట్రిమోని సైట్లో రిజిస్టర్ చేసి.. తర్వాత అమాయక యువకులకు ప్రొఫైల్స్ పంపుతున్నారు కేటుగాళ్లు. ఆ యువకులతో పరిచయం పెంచుకుని ఫోన్ కాల్స్, మెసేజ్ లతో దగ్గరవుతున్నాయారు. లేడీ వాయిస్ వచ్చేలా ప్రత్యేక యాప్ ల నుంచి ఆ యువకులకు కాల్స్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్పి.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో డబ్బులు లాగుతున్నారు కేటుగాళ్లు. ఇక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మోసగాడిలో ఒకడు గతంలో ఇదే తరహాలో మోసపోయిన బాధితుడే. అయితే తన విషయంలో పోలీసుల వద్దకు వెళ్లకుండా.. తనలా మరికొందరిని మోసం చేయాలని నిర్ణయించుకొని నేరాలకు పాల్పడుతున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu