Ad Code

ఇండోనేసియాలో స్నేక్ స్నాక్స్‌కు భారీ డిమాండ్ !


ఇండోనేసియా రాజధాని జకర్తాకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని ఓ వ్యక్తి పాములతో రకరకాల స్నాక్స్ తయారు చేస్తున్నాడు. ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర నాగుపాము పకోడీలను తయారు చూస్తున్నాడు. ఆ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. Akash Chaudhary అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఆకాష్ చౌదరి కోబ్రా పకోడీలను తినడానికి ప్రజలు ఎంత ఉత్సాహంతో అక్కడికి వస్తున్నారో చూపించాడు. అంతేకాదు ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర జనాలు నాగుపాము రక్తాన్ని కూడా తాగుతున్నారట!. అది తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా, చర్మానికి మంచి మెరుపు కూడా వస్తుందట. ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర ఒక పెద్ద బోను ఉంది. ఆ బోనులో బతికి ఉన్న నాగు పాములు ఉన్నాయి. ఒక్కో నాగు పాము ధర రూ. 2 లక్షల ఇండోనేషియా రూపాయిలు అట. అంటే భారతీయ కరెన్సీలో వెయ్యి రూపాయలు. ఎవరైనా ఆర్డర్ చేసే ఆ బోనులో నుంచి పాములను తీసి స్నాక్స్ తయారు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu