Ad Code

తండ్రీ కొడుకులు కలిసి బాలికపై అత్యాచారం !


త్తరప్రదేశ్ లోని హమీర్‌పూర్‌ జిల్లాలోని మోహదా కొత్వాలి ప్రాంతంలో తండ్రీకొడుకులు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. బండ గ్రామానికి చెందిన బాలిక తన కుటుంబంతో కలిసి ఘతంపూర్‌లోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తుండేది. పట్టణంలోని ఫతేపూర్‌కు చెందిన యువకుడితో ఆమెకు ప్రేమ వ్యవహారం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సంతోషంగా గడుపుదామని కూడా ప్రమాణం చేసుకున్నారు. కాగా జులై 26న మౌదాహాలోని ప్రేమికుడి వద్దకు ప్రియురాలి వెళ్లింది. దీనిపై యువతి తండ్రి యువకుడిపై ఫిర్యాదు చేశాడు. కాగా విచారణలో భాగంగా ప్రియుడి ఇంటికి వెళ్లిన పోలీసులకు తండ్రి మాయమాటలు చెప్పాడు. బాలిక వయసు తక్కువ ఉన్నందున నకిలీ పత్రాలు సిద్ధం చేసి ఆలయంలో పెళ్లి చేసుకున్నారని చెప్పాడు. ఆ తర్వాత బాలికను ప్రియుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అప్పటినుంచి తండ్రీకొడుకులు తనపై నిరంతరం అత్యాచారం చేస్తున్నారని బాలిక ఆరోపించింది. ఎలాగోలా వారిద్దరి బారి నుంచి బయటపడి కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని బాలిక చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కూతురితో కలిసి మొహడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ప్రేమికుడు, అతని తండ్రిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu