Ad Code

డీసీఎం వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురి మృతి !


తెలంగాణలోని సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం గుర్రాల సోఫా కూడలిలో కంకులు తరలిస్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,  డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తొగుట సీఐ లతీఫ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచినపల్లి గ్రామానికి చెందిన వంశీ (19), నవీన్ (20) తమ వ్యక్తిగత పనుల కోసం గజ్వేల్ పట్టణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. మెదక్ జిల్లా చేగుంట వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న మరో లారీని సైతం ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీ, నవీన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన డీసీఎం డ్రైవర్ రాకేష్‌ను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu