Ad Code

కూకట్ పల్లిలో దోమల కోసం పెట్టిన పొగకి యువకుడి మృతి !


హైదరాబాద్ లోని కూకట్ పల్లి శివానంద రిహబిలిటేషన్ హోమ్ లో విమల అనే మహిళ ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తూ తన తల్లిదండ్రులతో ఒక క్వార్టర్ లో నివాసం ఉంటోంది. గత శుక్రవారం రోజున రాత్రి స్వగ్రామం బాపట్ల నుండి ఉన్నత చదువుల కోసం వచ్చిన తమ్ముడు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్నారు, ఈ క్రమంలో దోమల నివారణకు ఉంచిన బత్తి మండి చుట్టుపక్కల ఉన్న వస్తువులకు అంటుకొని సిలిండర్ కు మంటలు వ్యాపించడంతో ఊపిరి ఆడక తమ్ముడు అభిషేక్ (27) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విమల 35 శాతం కాలిన గాయాలతో పక్కనే ఉన్న రాందేవ్ రావు ఆసుపత్రిలో ఐ సి యూ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ అటు ఆసుపత్రి వర్గాలు కానీ, పోలీసులు కానీ, ఫైర్ ఉద్యోగులు గాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. 

Post a Comment

0 Comments

Close Menu