Ad Code

శస్త్రచికిత్స చేసి కడుపులో టవల్ మరచిపోయిన వైద్యులు !


త్తరప్రదేశ్ లోని అలీఘర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ ప్రసవ సమయంలో ఆమె పొత్తికడుపులో టవల్‌ను వదిలి వేశారు. అయితే రాను రాను ఆమె ఆరోగ్యం క్షీణించిన తర్వాత  రెండోసారి శస్త్రచికిత్స చేసి టవల్ ను బయటకు తీశారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు సమాచారం అందించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ ఆదేశాలు జారీ చేశారు. వికాస్ కుమార్ భార్య ను ప్రసవం కోసం అలీఘర్‌లోని జిటి రోడ్‌లోని శివ మహిమ ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో వైద్యులు అనుకోకుండా ఆమె పొత్తి కడుపులో టవల్‌ను వదిలేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తీవ్రమైన కడుపునొప్పి వస్తోందంటూ ఫిర్యాదు చేసింది. అయితే ఆసుపత్రి వైద్యులు మందులను సూచించి భయపడకండని చెప్పారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత దిగజారింది.. ఆమె కుటుంబం మరొక ఆసుపత్రికి వెళ్లగా.. ఆమె కడుపులో టవల్ ఉందని కనుగొన్నారు. టవల్ తొలగించడానికి మరో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ ఘటన పట్ల మహిళ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులు తమ ఆందోళనలను పట్టించుకోకుండా కేవలం మందులతో ఇంటికి పంపించి తన భార్య ప్రాణాలకు ముప్పు తెచ్చారని, ఆసుపత్రి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వికాస్ కుమార్ ఆరోపించారు.

Post a Comment

0 Comments

Close Menu