Ad Code

వాగులో కొట్టుకుపోయిన కారు !


పంజాబ్‌లో పెళ్లి వేడుకకు కారులో బయల్దేరిన ఓ కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లింది. జైజోన్‌ అనే ప్రాంతంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న  ఓ వాగులో ఎస్‌యూవీ వాహనం కొట్టుకుపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందగా.. ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మెహత్‌పూర్ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్‌బీఎస్ నగర్‌లోని మెహ్రోవాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు మొత్తం 10 మంది కారులో ఉన్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరింత విషాదకరం. స్థానికులు ఒకరిని రక్షించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై డీఎస్పీ జాగిర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఏడుగురి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu