పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ మను భాకర్కు మూడో పతకం జస్ట్ మిస్సయ్యింది. శనివారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఆమె 4వ స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా షూటర్ యాంగ్ జీన్ స్వర్ణ పతకం సాధించారు. పారిస్ ఒలింపిక్స్లో రెండు వేర్వేరు షూటింగ్ ఈవెంట్లలో మను భాకర్ ఇప్పటికే రెండు కాంస్య పతకాలను సాధించారు. మూడో పతకం కోసం ఇవాళ పోటీపడ్డారు. అయితే, ఈ ఈవెంట్లో పతకం రాకపోయినా కూడా ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన భారత ప్లేయర్గా, భారత తొలి షూటర్గా చరిత్ర సృష్టించారు
0 Comments