Ad Code

ప్రియురాలిని పక్కకునెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు !


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన రాజేష్, ఎస్. కొండేపాడు గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని విషయాన్ని పెద్దల దృష్టికి తెచ్చారు. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి బైక్ పై పాలకొల్లు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ కి దూరంగా పట్టాల వద్ద నిల్చున్న యువతీ యువకుడు రైలు రాగానే పట్టాలపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా రైలు రాగానే  తాను చనిపోయినా తన ప్రియురాలు మాత్రం బతికి ఉండాలని భావించిన రాజేష్ ఆమెను వెనక్కి నెట్టేసి తాను మాత్రం రైలు కింద పడి ప్రాణాలు విడిచాడు. ప్రియుడి మృతదేహం దగ్గర ప్రియురాలు విలపిస్తుండడం గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రేమ విఫలమైన తామిద్దరం ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని, తన ప్రియుడు తనను పక్కకు నెట్టేసి రైలు కింద పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కింద పడటంతో గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu