Ad Code

లంచం డిమాండ్ చేసిన జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు !


హైదరాబాద్ కు చెందిన జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్ పెక్టర్ మనీష్ శర్మ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఓ వ్యక్తి నుండి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. ఐరన్ స్క్రాప్ గోదాం లో అక్రమాలపై జీఎస్టీ అధికారులు ఫైన్ విధించారు. బాధితుడు నుండి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. స్క్రాప్ గోదామును సీజ్ చేసిన అధికారులు అనంతరం ఈ సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేసారు. దాంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించగా బాధితుడి ఫిర్యాదుతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేసారు. అనంతరం రెండు ప్రాంతాల్లో సోదాల నిర్వహించిన సీబీఐ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu