Ad Code

భారీగా గంజాయి, హషిస్ అయిల్ పట్టివేత !


హైదరాబాద్ లోని అత్తాపూర్ మొగల్ కా నాలా, ధూల్పేట్ ప్రాంతంలో రూ. 46 లక్షల విలువ చేసే హషీష్ అయిల్, గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ జాయిట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. ఎక్సైజ్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏపీలోని కడపకు చెందిన సాధిక్ వలీ, రంపచోడ వరానికి చెందిన హరికుమార్, సత్యనారాయణ అనే ముగ్గురు హైదారాబాద్ కు 4.2కిలోల హషీష్ అయిల్ ను సరఫరా చేస్తుండగా ఉండగా మొగల్ కా నాలా వద్ద పట్టుకున్నామని పేర్కొన్నారు. వారిని విచారిస్తున్న క్రమంలో రాజమండ్రిలో మరింతగా గంజాయి ఉన్నట్లు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని పంపించి అక్కడి నుంచి 70.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. హషిష్, గంజాయి విలువ రూ. 46 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu