Ad Code

తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.5 కోట్లు అందించిన అరబిందో ఫార్మా !


తెలంగాణలో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అరబిందో ఫార్మా రూ.5కోట్లు విరాళంగా అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్&ఎండీ కె.నిత్యానంద రెడ్డి, కంపెనీ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, తదితరులు రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. ఏఐజీ హాస్పిటల్స్ యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయనిధికి  కోటి రూపాయలను విరాళంగా అందించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, తదితరులు చెక్కును అందజేశారు. 

Post a Comment

0 Comments

Close Menu