కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ అనే యువకుడు తన స్కూటర్ రిపేర్ చేయలేదన్న కోపంతో ఓలా షోరూమ్నే తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూం స్టాఫ్ను సంప్రదించాడు. అయితే ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి సిబ్బంది.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహానికి గురైన నదీమ్.. షోరూంకు నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. నిందితుడు నదీమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
0 Comments