Ad Code

రైలు పట్టాలపై రీల్స్‌ చేస్తూ మూడేళ్ల బాలుడితో సహా ప్రాణాలు కోల్పోయిన దంపతులు !

త్తరప్రదేశ్‌ లోని సీతాపూర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (26) తన భార్య, మూడేళ్ల బాలుడితో కలిసి రైలు పట్టాలపై రీల్స్‌ చేస్తున్నాడు. చేతిలో పసిబిడ్డ ఉన్నాడనే కనీస జ్ఙానం లేకుండా దంపతులు నిర్లక్ష్యం వహించారు. రైలు వచ్చే సంగతిని కూడా పట్టించుకోకుండా రీల్స్‌ చేయడంలో నిమగ్నమైపోయారు. ఇంతలో రైలు వేగంగా వారి పైకి దూసుకురావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఉమరియా గ్రామ సమీపంలో చోటుచేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu