Ad Code

అనుమానంతో రెండవ భార్యను హత్య చేసిన భర్త !


తెలంగాణలోని కామరెడ్డి జిల్లా సదశీవ్ నాగర్ మండలంలోని యాచారం కు చెందిన రాథోడ్ విజయ @ మీనాక్షి (32) కి డిచ్ పల్లి మండలం లోని వెస్లీ నగర్ తండా కు చెందిన రాథోడ్ గబ్బర్ సింగ్ తో 2016 లో రెండవ వివాహం కాగా విజయం కు సంతానం కలుగలేదు. గబ్బర్ సింగ్ తను వృత్తి రీత్యా హైదరాబాదులో పనిచేస్తూ తన రెండవ భార్య విజయతో కలిసి గత సంవత్సర కాలం నుండి హైదరాబాదులో ఉండగా, గబ్బర్ సింగ్ కొన్ని రోజుల క్రితమే డిచ్ పల్లి రైల్వేస్టేషన్ లోని తన ఇంటికి వచ్చి ఉన్నాడు. గతనేల 29న రాత్రి మృతురాలు కుడా డిచ్ పల్లి ఆర్ఎస్ వద్ద గల వారి ఇంటికి వెళ్ళిందని వివరించారు. మృతురాలు విజయ వారి ఇంట్లోనే అనుమానస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందింది. ఈ విషయమై విజయ తల్లి సకున ఫిర్యాదు మేరకు దర్యాఫ్తు చేసినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త గబ్బర్ సింగ్ హత్య చేసాడనే పిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, దర్యాప్తులో భాగంగా మృతురాలి భర్త రాథోడ్ గబ్బర్ సింగ్ తను హైదరాబాద్ లో లేని సమయంలో, మృతురాలు హైదరాబాద్ లో ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకుని గతనేల 29 నాడు మృతురాలికి ఫోన్ చేసి డిచ్ పల్లి కి పిలిపించుకుని సాయి నగర్ లోని తన ఇంట్లోని రెండవ అంతస్తులో తిట్టి, కొట్టి చున్నితో మెడకు గట్టిగ గొంతు బిగ్గించి చంపివేసి, తర్వాత ఫ్యాన్ కు వ్రేలాడ తీసి, మృతురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రిక రించినట్లు వివరించారు. కేసు దర్యాప్తు లో భాగంగా డిచ్పల్లి CI గారు మరియు వారి సిబ్బంది తేది:31-08-2024 నాడు నేరస్తుడు గబ్బర్ సింగ్ ని అరెస్ట్ చేసి, ఈరోజు తేది:01-09-2024 నాడు నేరస్తుడిని రిమాండ్ కి తరలించామని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్ అన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu