Ad Code

రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ఇప్పటికైనా అర్థమైందా ?


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ఇప్పటికైనా అర్థమైందా అంటూ ఎక్స్ వేదికగా నాగబాబు స్పందించారు. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రిని అభినందిద్దాం అంటూ ఆయన పేర్కొన్నారు. ''రేవంత్ రెడ్డిగారూ మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు సంపూర్ణ మద్దతుగా మేము నిలబడతాం'' అని నాగబాబు పేర్కొన్నారు. ''పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది'' అంటూ ఆయన పేర్కొన్నారు. వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్‌మెంట్లలోకి కూడా నీళ్లు వస్తున్నాయని, కొందరు సామాన్యులు బలికావడం చాలా బాధాకరమని నాగబాబు ప్రస్తావించారు. వీటికి ముఖ్య కారణం చెరువుల్ని, నాళాలను అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రంగా ఉండాలంటూ నాగబాబు సూచించారు. ''భారీ వర్షాలు, వరదల బారిన పడ్డ లోతట్టు ప్రాంతాల వారందరూ అప్రమత్తంగా ఉండండి. ముంపు ప్రాంతాలన్నింటికీ ఏపీ ప్రభుత్వం సహాయ సాకారాలు చేబట్టింది. అత్యవసర సమయాల్లో తప్ప, ప్రజలు వరద ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు బయటకి రాకండి. స్టే సేఫ్'' అని వ్యాఖ్యానించారు.

Post a Comment

0 Comments

Close Menu