Ad Code

ప్రియుడితో ఉండగా చూసిందని తల్లిని చంపిన కూతురు !


బెంగళూరుకు చెందిన జయలక్ష్మి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. విచారణ జరిపిన పోలీసులకు ఆమె కుమార్తె పవిత్ర సురేష్, తన తల్లి బాత్ రూంలో జారి పడిందని చెప్పింది. అపస్మారక స్థితిలో ఉండగా చూసి ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పింది. పోలీసులు కూడా అదే రాసుకున్నారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఊపిరి ఆడకుండా చేయడం వల్ల చనిపోయిందని రిపోర్టు వచ్చింది. దీంతో పోలీసులు మెల్లగా తవ్వడం ప్రారంభించారు. చివరికి అన్ని వేళ్లూ పవిత్ర సురేష్ వైపే చూపించాయి. ప్రియుడితో ఏకాంతంలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకన్న తల్లిని హత్య చేసినట్లు తెలిసినది.  పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో చివరికి నేరం ఒప్పుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కలిసి తన తల్లిని చంపేశానని ఒప్పుకుంది. పవిత్రా సురేష్ కు గతంలో పెళ్లి అయింది. అయితే దారి తప్పిన పవిత్రా సురేష్ తన కంటే పదేళ్లు చిన్న వాడైన యువకుడితో వివాహేత బంధం పెట్టుకుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన తల్లి ఇంట్లోనే ఓ కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ దుకాణంంలో ఆమె తల్లితో కూడా పని చేయించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ తల్లిని దుకాణంలో ఉంచి, వేరే దారి ద్వారా ప్రియుడ్ని లోపలికి పిలిపించుకునేది. ఇలా చేస్తున్న సమయంలో ఓ సారి తల్లి చూసింది. ఈ వ్యవహారం పయట పడటంతో మొత్తం అందరికీ తెలిసిపోతుందని, తన తల్లి ఇంటికి రానివ్వదన్న భయంతో ఇద్దరూ కలిసి ఆమెను చంపేసి బాత్ రూంలో పడి చనిపోయిందని నాటకం ఆడారు. పోలీసులు ఇద్దర్నీ అరెస్టు చేసి జైలుకు పంపారు. 

Post a Comment

0 Comments

Close Menu